Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బంగారం ధర మంగళవారం కొంత శాంతించింది. దేశీ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.38,370లకు పడిపోయింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.38,370కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.38,200లకు దిగొచ్చింది. అంతర్జాతీయంగా ట్రెండ్ సానుకూలముగా ఉన్నా కూడా దేశీ జ్యువెలర్ల సంస్థల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర క్షీణించిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా మంగళవారం వెండి ధర మాత్రం రికార్డు స్థాయిలో రూ.2,000 మేర పెరిగి ఆల్టైమ్ రికార్డ్ స్థాయిని తాకింది. కేజీ వెండి ధర రూ.47,000 మార్క్కు పరుగులు పెట్టింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పంజుకోవడం ధరపై ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. హైదరాబాద్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.38,080కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.36,270కు పెరిగింది. కేజీ వెండి ధర (రిటైల్) రూ.49,000 వద్దకు ఎగసింది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం పరుగులు పెడుతూనే ఉంది. ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. పసిడి ధర ఔన్స్కు 0.7 శాతం పెరుగుదలతో 1,521.98 డాలర్లకు చేరింది. అలాగే వెండి ధర ఔన్స్కు 1.8 శాతం పెరుగుదలతో 17.36 డాలర్లకు ఎగసింది.