Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మెరుగైన సేవలను అందిస్తూ ఆంధ్రా బ్యాంక్ అభివృద్ధి పథంలో దూసుకుపో తోందని ఆ బ్యాంక్ హైదరాబాద్-2 జోన ల్ మేనేజర్ యం. రవీంద్రబాబు అన్నా రు. బ్యాంక్ నిర్వహించిన చిన్న తర హా పరిశ్రమలు, వ్యక్తిగత రుణ గ్రహీతల అవగాహన సదసుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. జోన్ పరిధిలోని 78 శాఖల ద్వారా బ్యాంక్ మొత్తం రూ.11,150 కోట్ల మేర వ్యాపారాన్ని కలిగి ఉందని అన్నారు. ఇందులో రూ.3600 కోట్లు రుణా లు కాగా.. రూ.7550 కోట్ల మేర డిపాజిట్లు కలిగి ఉన్నామని తెలిపారు. మొత్తం రుణాలలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.586 కోట్లు, గృహ మరియు విద్యావసరాలకు రూ.1534 కోట్లు వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ. 861 కోట్ల మేర రుణాలను అందించినట్టుగా ఆయన తెలిపారు. ఇతర రుణాలు మొత్తం రూ.691 కోట్ల వరకు ఉన్నాయని ఆయన అన్నారు. రుణాలపై వడ్డీరేట్లు ఈ శుక్రవారం నుంచి పావు శాతం మేర తగ్గుతున్నట్టుగా ఆయన వివ రించారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో భాగంగా వివిధ సందేహాలను ఆయన సభావేదిక నుంచి నివృతి చేశారు. మెరుగైన సేవలను అందించడానికి ఆంధ్రాబ్యాంక్ ఎల్లప్పుడు అందు బాటులో ఉంటుందని ఆయన తెలిపారు.