Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ సరికొత్త వాహనం ట్రైబర్ను మార్కెట్లోకి విడుదల చేసేం దుకు రంగం సిద్ధం చేసు కుంటోంది. కాంపాక్ట్ ఎంపీవీ క్రాస్ఓవర్ విభా గంలో కంపెనీ కొత్తగా 'ట్రైబర్' వాహనాన్ని అందుబాటులోకి తేనుంది. ఆగస్టు 28 న రెనాల్ట్ ట్రైబర్ లాంచ్ కానుంది. 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ యూనిట్, డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 8-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లతో ఇది లాంచ్ కానుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ , 5-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ అప్షన్స్లలో ఈ వాహనం అందుబాటులోకి రానుంది. ట్రైబర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డ్రిల్స్, రూఫ్ స్పోర్టివ్ లుక్తో వస్తున్న ఈ కారు మారుతీ స్విఫ్ట్, ్ట, ఫోర్డ్ ఫిగో, ఫ్రీస్టైల్, హ్యుందారు గ్రాండ్ ఐ 10 నియోన్లకు గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. భద్రతా ఫీచర్ల విషయానికొస్తే, రెనాల్ట్ ట్రైబర్లో 4 ఎయిర్ బ్యాగులు, ఎబీఎస్, ట్విన్ ఎయిర్ బ్యాగులు, స్పీడ్ అలర్ట్లు, సీట్ బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ కెమెరాను తదితర అంశాలను జోడించారు. ఈ వాహనం అధికారిక బుకింగ్లు శనివారం (17వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. రెనాల్ట్ వెబ్సైట్, లేదా దగ్గరిలోని బ్రాండ్ డీలర్ ద్వారా కేవలం 11,000 రూపాయలు చెల్లించి ప్రీ బుక్ చేసుకోవచ్చని తెలిపింది.ఈ కార్ ధరలు సుమారు రూ. 5-7 లక్షల మధ్యన ఉంటుందని అంచనా.