Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: బంగారం ధరలు కాస్త శాంతించాయి. రికార్డు గరిష్టాలను తాకుతూ పరుగులు పెట్టిన పుత్తడి ధరలు దేశీయంగా డిమాండ్ తగ్గడంతో కాస్త దిగివచ్చింది. ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 క్షీణించి రూ.37,700లకు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 తగ్గి రూ.36,500 వద్ద నిలిచింది. మరోవైపు హైదరాబాద్ మార్కెట్లో కూడా గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2,490 మేర దిగివచ్చి రూ.37,080 వద్ద నిలిచింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.360 తగ్గుదలతో రూ.35,760లకు చేరింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నప్పటికీ అత్యధిక ధరల వద్ద ఇన్వెస్టర్ల బంగారం అమ్మకాలకు పాల్పడడం, జ్యువెల్లర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా-చైనా మధ్య ట్రేడ్వార్లో తాజా పరిణామాలతో ఆసియా కరెన్సీలు బలపడ్డాయి. అగ్రరాజ్యం చైనా దిగుమతులపై 10 శాతం దిగుమతి సుంకం అమలును డిసెంబర్ వరకు వాయిదా వేసింది. దీంతో దేశీయ కరెన్సీ రూపాయి, ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్కు 0.29 శాతం పెరుగుదలతో 1,532.15 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్కు 0.28 శాతం పెరిగి 17.32 డాలర్లకు ఎగసింది.