Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విఫల లావాదేవీలు లెక్కించొద్దు: ఆర్బీఐ
ముంబయి: స్వయం చలిత నగదు వితరణ యంత్రాల (ఏటీఎం) లావాదేవీలకు సంబం ధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కాస్త ఊరట నిచ్చే నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రతినెలా బ్యాంకులు వినియోగదారులకు అందించే ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ కోటాలో విఫలమైన, బ్యాలెన్స్ తెలుసుకొనే లావాదేవీలను లెక్కించవద్దని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. సాంకేతిక కారణాల వల్ల లావాదేవీలు విఫలం కావడం, నగదు లేక ఏటీఎం నుంచి డబ్బు రాకపోవడం వంటి లావాదేవీలను కూడా బ్యాంకులు లెక్కలోకి తీసుకుం టున్నాయని అందుతున్న ఫిర్యాదులతో ఆర్బీఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ సమస్యలు, ఏటీఎంలో కరెన్సీ అందుబాటులో లేకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల తరు చూ ఏటీఎం లావాదేవీలు విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తు తం అన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు ఏటీఎం యంత్రాల ద్వారా సగటున ప్రతి నెలా 5 వరకూ ఉచిత ట్రాన్సాక్షన్కు అవకాశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బు తీసే ప్రయత్నంలో విఫలమైతే.. ప్రతి నెలా నిర్దేశిత ఉచిత లావాదేవీల్లోంచి ఒకటి వృథా అయిపోతోంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటివి ప్రయత్నించినా ఇదే జరుగుతోంది. చివరికి ఏటీఎంలో నగదు లేకపోయినా వినియోగదారుడు ఉచిత లావాదేవీలు నష్టపోవాల్సి వస్తోంది. నెలలోపు ఉచిత 5 లావాదేవీలు పూర్తయితే తర్వాతి నుంచి బ్యాంకులు రుసుములు వసూలు చేస్తున్నాయి. అయితే వీటిని కూడా బ్యాంకులు ఉచిత ఏటీఎం ట్రన్సాక్షన్ కోటా నుంచి తగ్గించేస్తూ.. అవసరమైతే వాటి నుంచి వాడకం రుసు మును వసూలు చేస్తున్నాయి. ఈ విషయమై ఆర్బీఐకి పలు ఫిర్యాదు వచ్చి న నేపథ్యంలో పెద్దబ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు తాజా ఆదేశాలను జారీ చేసింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకు లు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, చిన్న ఫైనా న్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల తో సహా అన్ని వాణిజ్య బ్యాంకులకు కూడా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.