Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్ కేంద్రంగా విస్తరిస్తోన్న స్టార్టప్ సంస్థ మంగమ్మ ఫుడ్స్ ప్రయివేటు లిమిటెడ్ (ఎంఎఫ్పీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేగంగా విస్తరిం చాలని యోచిస్తోంది. ఇందు లో భాగంగా సంస్థ శుక్రవారం 'అమ్మ మ్మాస్' బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి 'రెడీ2కుక్' ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఈ బ్రాండ్ కింద ప్లెయిన్ చపాతి, రాగి చపాతి, మేతి చపాతి, మల్టీ గ్రెయిన్ చపాతి, మోరింగ చపాతీలతో పాటు వివిధ రకాల పొరోటాలు పూరీలను మార్కెట్లో అందుబాటులోకి తెస్తున్నట్టుగా సంస్థ సహ వ్యవస్థాపకుడు నాగసాయి విశ్వనాథ్ తెలిపారు. తమ ఉత్పత్తులను ఆహార భద్రతా నిబంధనల మేరకు మంచి పోషక విలువలతో పాటు రుచికరంగా అంది చనున్నుట్టుగా ఆయన వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రోజుకు లక్షల యూనిట్ల విక్రయమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతు న్నామన్నారు. ఆ తరువాత రెండేండ్లలో తామ వ్యాపారాన్ని రెట్టింపు చేసేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టు ఆయన తెలిపారు. తమ బ్రాండ్ ఉత్ప త్తుల అమ్మకాలకు గాను ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తెచ్చా మని..9347815723 నంబర్కు వాట్సప్ చేసి బల్క్ ఆర్డర్ను బుక్ చేసుకో వచ్చని సంస్థ మరో సహ వ్యవస్థాపకురాలు ప్రతిమ విశ్వనాథన్ వివరించారు. తాము అందుబాటులోకి తెస్తున్న రెడి2కుక్ ఉత్పత్తులు దాదాపు ఏడు రోజుల పాటు పాడవకుండా ఉంటాయని ఆమె తెలిపారు.