Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న భారత్ను ఐదు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా తనవంతు తోడ్పాటును అందిస్తోందని ఆ బ్యాంక్ తెలంగాణ జోనల్ మేనేజర్ ఎల్. మురళీకృష్ణ రాజు అన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణా జోన్ పరిధిలో 'మెగా వినియోగదారుల సమావేశం' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజు మాట్లాడుతూ బ్యాంక్ రూ.8,88,725 కోట్లమేర బలమైన వ్యాపారాన్ని కలిగి ఉందని అన్నారు. దేశంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధికి బ్యాంక్ కట్టుబడి పని చేస్తోందని ఆయన వివరించారు. వ్యవసాయం, వ్యసాయాధారిత మౌలిక రంగాలతో పాటు పరిశ్రమలకు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా విరివిగా రుణాలను అందిస్తోందని అన్నారు. సమాజంలోని బడుగువర్గాల వారితో పాటు తెలంగాణలో మౌలిక రంగం అభివృద్ధికి బ్యాంక్ పలు ప్రభుత్వ రంగ సంస్థలకు, కార్పొరేషన్లకు రుణాలను అందిస్తోందని తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత విషయంలోనూ బ్యాంక్ ముందుందని ఆయన అన్నారు. గతేడాది బ్యాంక్ రూ.3.95 కోట్ల మేర నిధులను సీఎస్ఆర్ విభాగంలో ఖర్చు చేసిందని ఆయన వివరించారు.