Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు గాను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీఐ) కొత్తగా మరో 'కాంటాక్ట్ సెంటర్'ను అందుబాటులోకి తెచ్చింది. దక్షిణ భారతంలోని రాష్ట్రాలు, రాజస్థాన్ రాష్ట్రంలోని వినియోగదారులకు సేవలందించేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కాంటాక్ట్ సెంటర్ను బ్యాంక్ జీఎం ఆర్.కె.చటర్జీ శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఎన్బీ తెలంగాణ సర్కిల్ హెడ్ రాధిక శివరామ్ బట్వాడేకార్తో కలిసి చటర్జీ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్వి డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ వారి సౌజన్యంతో పీఎన్బీ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పీఎన్బీకి దేశ వ్యాప్తంగా ఇప్పటికే మూడు కాంటాక్ట్ సెంటర్లు ఉన్నాయి. ఈ కేంద్రం సంవత్సరం పోడువునా నిరంతరాయంగా పని చేస్తుందని పీఎన్బీ వెల్లడించింది.