Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తెలంగాణ సర్కిల్ పరిధిలోని బ్రాంచ్ మేనేజర్ల సమావేశం శనివారం హైదరాబాద్లో జరిగింది. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు వివిధ రంగాలకు బ్యాంకు రుణాలు పూర్తిస్థాయిలో చేరేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించేందుకు క్షేత్రస్థాయి అధికారులతో సంప్రదింపులు జరపాలని కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు పీఎన్బీ ఈ సమావేశం నిర్వహించింది. పీఎన్బీ జనరల్ మేనేజర్ రాథోర్, పీఎన్బీఐ తెలంగాణ సర్కిల్ అధినేత్రి రాధిక బటవాడేకర్ల సమక్షంలో ఈ మేథోమథన సదస్సు జరిగింది. ఈ సమాలోచనల సదస్సులో పీఎన్బీకి చెందిన వివిధ బ్రాంచీల అధికారులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను ఉన్నతాధికారులతో పంచుకున్నారు. రుణాల వితరణలో వస్తోన్న అవరోధాలను తొలగించేందుకు గాను వారు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాల్గొని విలువైన సూచనలు చేసిన అధికారులకు జనరల్ మేనేజర్, సర్కిల్ అధినేత్రి కృతజ్ఞతలు తెలిపారు.