Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రీజినల్ స్థాయి సమావేశంలో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
నవతెలంగాణ-వాణిజ్య విభాగం : పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటుకు దిగువస్థాయి నుంచి సంప్రదింపులు జరపాలన్న కేంద్రం ఆదేశాల మేరకు.. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజినల్ కార్యాలయం అధికారులు ఆ బ్యాంకు పరిధిలోని అన్ని బ్రాంచీల సిబ్బందితో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. బ్యాంకింగ్ రంగం ముందున్న సవాళ్లు, భవిష్యత్లో పురోగమించేందుకు అవసరమైన మార్గాలపై ఈ సమావేశంలో సమాలోచనలు జరిపారు. పౌరులే కేంద్రంగా బ్యాకింగ్ సేవలందించడం, ఎంటర్ప్రెన్యూర్లు, రైతులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, చిన్న పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా సేవలందించే అంశంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బ్యాంకుల్లో అవసరమైన సంస్కరణలకు సంబంధించి.. డిజిటల్ పేమెంట్ పెంచడంపై నందన్ నీలేకని, పీఎస్బీల్లో కార్పొరేట్ పాలనపై ఉదరు కోటక్లాంటివారు ప్రెజెంట్ చేసిన పేపర్లపై మేథోమథనం గావించారు. ఆర్థికాభివృద్ధికి రుణ సహకారం, మౌలిక వసతులు, పరిశ్రమలు, వ్యవసాయరంగం, జల శక్తి, విద్యా రుణాలు లాంటి జాతిహితమైన అంశాలనూ సమీక్షించారు. ఫలితంగా ప్రభుత్వ బ్యాంకుల నిర్వహణ మరింత మెరుగుపరుచుకునేందుకు, ఎలాంటి భవిష్యత్ మార్గాలు అనుసరించాలన్న విషయాలపై ఆచరించదగ్గ, సరికొత్త అభిప్రాయాలు ఈ సంప్రదింపుల సమావేశంలో ముందుకు వచ్చాయి. ఈ సలహాలు, సూచనలను క్రోడీకరించి వాటిపై ఉన్నతస్థాయిలో చర్చలు జరిగేందుకు ప్రధాన కార్యాలయానికి పంపినట్టు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాధ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.