Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంకుతున్న విదేశీ పెట్టుబడిదారులు
న్యూఢిల్లీ: విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడిదారులు ఆగస్టు మొదటి అర్ధభాగంలో మూలధన మార్కెట్ల నుంచి నికర ప్రాతిపదికన రూ.8,319 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఎఫ్పీఐ ట్యాక్స్లు, ప్రపంచ వాణిజ్య ఘర్షణల మధ్య మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, అమ్మకాల తగ్గుదల నేపథ్యంలోనే ఈ పరిస్థితులకు దారితీసినట్టు తెలస్తున్నది. 'డిపాజిటరీ' సమాచారం ప్రకారం.. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ఈ నెల అర్ధభాగంలో నికరంగా రూ.10,416.25 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. అయితే, ఈ కాలంలోనే ఎఫ్పీఐలు రూ.2,096.38 కోట్లను రుణ సెక్యూరిటీలలో పెట్టుబడులగా పెట్టడం గమనార్హం. ఈ నెలలోని 10 ట్రేడింగ్ సెషన్లలో తొమ్మిదింటిలో ఎఫ్పీఐలు అమ్మకందారులకు ''తీవ్ర ప్రతికూల భావన''ను సూచిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. 'జూలైలో విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడిదారులు భారత మూలధన మార్కెట్ల నుంచి రూ.2,985.88 కోట్లను ఉపసంహరించుకున్నారు. విదేశీ పోర్టుఫోలియోపై అధికపన్ను, మార్కెట్ల అనిశ్చితి పెట్టుబడిదారులను ప్రభావితం చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన అధిక సర్చార్జి, సూపర్ రిచ్ పన్నులను ప్రవేశపెట్టినప్పటి నుంచి వారు భారత ఈక్విటీల నుంచి నిష్క్రమించారు' అని శ్రీవాస్తవ తెలిపారు.
దేశ ఆర్థిక వృద్ధి మందగమనం, మార్కెట్ల పతనం, అలాగే ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కూడా పెట్టుబడిదారులను ప్రభావితం చేసిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.