Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాణిజ్య యుద్ధ ప్రభావం అంతంతే !
- తాజా సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: రోజురోజుకూ ముదురుతున్న చైనా-అమెరికా వాణిజ్య సంక్షోభం చైనాలో పనిచేస్తున్న భారతీయ కంపెనీలపై ఎలాంటి ప్రభావమూ చూపలేదని ఓ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా, ఈ ఏడాది చైనాలో పెట్టుబడులను పెంచుకోవాలనే యోచనలో భారతీయ ఐటీ, బీపీఓ కంపేనీలు ఉన్నట్టు 'ఇండిస్తీ బాడీ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టి(సీఐఐ), రీసెర్చ్ అండ్ ఎనలిటిక్స్ కంపెనీ ఎవాల్య్వూసర్వ్'లు తమ సర్వేలో వెల్లడించాయి. గతేడాదితో పోలిస్తే బీపీఓల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ సర్వే తన నివేదికలో పేర్కొంది. సర్వేలోని వివరాల ప్రకారం.. చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాటిలో 98 శాతం కంపెనీలు తమ వాణిజ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వాటిలో రెండొంతుల కంపెనీలు తమ పెట్టుబడులను 2018 కంటే ఎక్కువకు పెంచాలని భావిస్తున్నాయి. చైనాలోని 57 భారతీయ కంపెనీల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా ఈ నివేదికను తయారు చేశామని సీఐఐ తెలిపింది. సర్వేలో 74 శాతం కంపెనీలు చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం కారణంగా తమ వ్యాపారంపై ఎలాంటి ప్రభావమూ చూపలేదని నివేదిక పేర్కొంది. గత సర్వేతో పొలిస్తే చైనాలో పనిచేస్తున్న భారతీయ కంపెనీలు మంచి ఫలితాలు ఉంటాయనే ఆశావాదాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్టు సర్వేలో వెల్లడైందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు.