Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బ్యాంకింగ్ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను గురించి సమీక్షించేం దుకుగాను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) హైదరాబాద్ ప్రాంతీయ కార్యక్రమంలో సమాలోచనల సదస్సు జరిగింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సమాలోచనలన సదస్సులో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోకి వచ్చే బ్యాంకుకు చెందిన అన్ని శాఖల అధికారులు ఈ సమాలోచనల సదస్సులో పాల్గొన్నట్టుగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర ఆర్థిక కార్యకలాపాల శాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు తాము ఈ సమాలోచనల సదస్సు నిర్వహించి నట్టుగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీ య ప్రయోజనాలకు కట్టుడి పని చేస్తూనే బ్యాంక్ వ్యాపార అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సమీక్ష జరిగిపినట్టగా బ్యాంక్ వెల్లడించింది. ఇందులో ఆయా బ్రాంచీలకు చెందిన అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నట్టుగా బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.