Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ మేడిన్ఇండియా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో మంగళవారం విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ సిరీస్లో భాగంగా గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ పేరుతో వీటిని మార్కెట్లోకి తెచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ ధరలను కంపెనీ వరుసగా రూ.69,990, రూ.79,990గా నిర్ణయించింది. ఈ చర్యతో సంస్థ యాపిల్, గూగుల్ లకు షాక్ ఇచ్చింది. భారత్లో ఆరా బ్లాక్, ఆరా గ్లో, ఆరా వైట్ రంగుల్లో వీటిని విడుదల చేసింది. ఆగస్టు 22 వరకు ప్రధాన రీటైల్ దుకాణాలు సహా ఈ-కామర్స్ సైట్లలో ప్రీ బుక్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. విక్రయాలు ఆగస్టు 23 నుంచి ప్రారంభం అవుతాయని సంస్థ తెలిపింది. మేడిన్ ఇండియా ఫోన్ల అవిష్కరణ సందర్భంగా సంస్థ గెలాక్సీ నోట్ 10-సిరీస్ కొనుగోలుదారులు యూట్యూబ్ ప్రీమియం ఆరు నెలల సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. అలాగే ప్రీ-ఆర్డర్ చేసిన కొనుగోలుదారులు గెలాక్సీ వాచ్ యాక్టివ్ను దాని అసలు అమ్మకపు ధర రూ.19,990 కు బదులుగా రూ.9,999 తగ్గింపుతో పొందవచ్చని తెలిపింది.