Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
రెడీమేడ్ దుస్తుల కంపెనీ రాయల్ క్లాసిక్ మిల్స్కు చెందిన మెన్స్లైఫ్ స్టైల్ బ్రాండ్ 'క్లాసిక్ పోలో' ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కొత్తగా 65 అవుట్లెట్లను తెరువాలని నిర్దేశించుకుంది. ప్రస్తుతం తమ సంస్థకు 135 అవుట్లెట్లు ఉన్నాయని, ఇందులో అత్యధికంగా దక్షిణాదిలోనే ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మంగళవారం హైదరాబాద్లో క్లాసిక్ పోలో రిటైల్ డైరెక్టర్ రమేష్ వి ఖేని, బిజినెస్ డెవలప్మెంట్ జనరల్ మేనేజర్ జి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే మార్చి నాటికి మొత్తం స్టోర్లను 200కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకటున్నామన్నారు. వ్యర్థ నీటి బాటిళ్ల నుంచి వచ్చిన పోగులతో దుస్తులను తయారు చేసినట్లు తెలిపారు. 50 శాతం ప్లాస్టిక్ పోగులు, మరో 50 శాతం నూలు పోగులను ఉపయోగించి వీటిని తయారు చేసిన తొలి సంస్థ తమదేనని పేర్కొన్నారు. త్వరలో వెదురుతో తయారు చేసిన దుస్తులను కూడా అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 6,000 మల్టీ బ్రాండ్ అవుట్లెట్లలో తమ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని.. వీటిని కూడా భారీగా విస్తరించాలని నిర్దేశించుకున్నా మన్నారు. క్లాసిక్ పోలో బ్రాండ్పై 2018-19లో రూ.160 కోట్ల టర్నోవర్ నమోదు చేశామన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.200 కోట్ల టర్నోవర్ సాధించాలని, తర్వాత ఏడాదిలో రూ.225-250 కోట్ల రెవెన్యూ అంచనా వేస్తున్నామన్నారు. 2019-20లో కంపెనీ గ్రూపు టర్నోవర్ రూ.1,000 కోట్లకు చేరొచ్చని.. గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్లుగా నమోదయ్యిందన్నారు.