Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రోజూ నష్టాలు
ముంబయి : మాంద్యం భయాలతో వరుసగా రెండో రోజూ దేశీయ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. బుధవారం బీఎస్ఇ సెన్సెక్స్ 267.64 పాయింట్లు తగ్గి 37,060.37కు పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 98.30 పాయింట్లు కోల్పోయి 10,918.70 వద్ద ముగిసింది. మిడ్సెషన్ వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు జూన్తో ముగిసిన త్రైమాసికంలో దేశ జిడిపి తగ్గొచ్చన్న అంచనాలు మార్కెట్లను తిరిగి నష్టాల్లోకి జారేలా చేశాయి. మరోవైపు సేవారంగం ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, వినియోగం తగ్గడం తదితర ప్రతికూలతలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. రంగాల వారీగా లోహ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, పవర్, ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫార్మా, ఐటీ రంగాల షేర్లు నష్టాలు చవిచూశాయి. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెయుఎల్ షేర్లు లాభపడగా.. టాటా మోటార్స్, ఇండియా బుల్స్ హౌసింగ్, యస్ బ్యాంక్, గ్రాసిమ్ ఇండిస్టీస్, టాటా స్టీల్ షేర్లు అధిక నష్టాలు చవిచూశాయి.