Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ బుధవారం మార్కెట్లోకి సరికొత్త మల్టీ పర్పస్ వెహికల్ ఎక్స్ఎల్6ని విడుదల చేసింది. కంపెనీ నుంచి వచ్చిన బిఎస్-6 మోడల్ వాహనాల్లో ఇది ఏడోది కావడం విశేషం. దీని ధర రూ.9.79లక్షల నుంచి రూ.11.46 లక్షలుగా నిర్ణయించింది. ఫైవ్ స్పీడ్ మ్యానువల్ గేర్బాక్స్తో పాటు ఫోర్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మొత్తం ఆరు సీట్లు ఉండనున్నాయి. కంపెనీకి చెందిన నెక్సా ప్రీమియం రిటైల్ కేంద్రాలలో వీటిని విక్రయించనున్నట్లు మారుతి సుజుకి తెలిపింది.