Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : విలాసవంత కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యు బుధవారం భారత మార్కెట్లోకి సెడాన్ 3 సిరీస్లో సరికొత్త వెర్షన్ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్షోరూం వద్ద దీని ధరను రూ.41.4- 47.9 లక్షల మధ్య నిర్ణయించినట్లు బీఎండబ్ల్యు ఇండియా ప్రెసిడెంట్, సీఇఓ రుద్రతేజ్ సింగ్ తెలిపారు. బీఎండబ్ల్యు 330ఐ, బీఎండబ్ల్యు 320డి ఇంజిన్లతో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. గత వెర్షన్లతో పోలిస్తే ఈ కొత్త కారు బరువు 55 కిలోలు తక్కువ ఉండగా లోపలి వైశాల్యం పెరిగిందన్నారు.