Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గోరీన్ ఈ మొబిలిటీ, ఓపై ఎలక్ట్రానిక్ల సంయుక్త సంస్థ జమోపారు ఎలక్ట్రిక్ భారత్లో 'ది ఆస్ట్రిడ్ లైట్' పేరుతో విద్యుత్తు స్కూటర్ను విడుదల చేసింది. దీని ధరను కంపెనీ రూ.79,999గా నిర్ణయించింది. ఈ స్కూటర్లో 2,400 వాట్స్ విద్యుత్తు మోటార్ ఉంది. 1.7కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఒక సారి చార్జింజ్ చేసే డ్రైవింగ్ కండీషన్లను బట్టి 75-90 కిలోమీటర్ల మధ్య మైలేజీని ఇస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు. దీనిలో సిటీ, స్పోర్ట్స్, ఎకానమీ అనే మూడు మోడ్లు ఉన్నాయి. దీనిలో ఆదనపు బ్యాటరీ అమర్చుకునే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఇది ఏకధాటిగా 150-180 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అదే సమయంలో కంపెనీ ప్రారంభ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ స్కూటర్ నియాన్, డీప్ ఇండిగో, ఫైరీ రెడ్, బ్రంట్ చార్కోల్, ఫైర్బాల్ ఆరెంజ్ అనే ఐదు రంగుల్లో లభిస్తోంది. అక్టోబర్ మొదటి వారం నుంచి ఈ స్కూటర్ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ స్కూటర్ల విడుదల సందర్భంగా కంపెనీ సహవ్యవస్థాపకుడు అమిత్ రాజ్ సింగ్ మాట్లాడుతూ ''స్టైల్, అనుభవం, పనితీరును మేళవించిన ఈ స్కూటర్ గా తీర్చిదిద్దామని తెలిపారు. ఇది పర్ఫెక్ట్ సిటీ స్కూటర్గా రాణిస్తుంది. దీని ధర వారీగా చూస్తే ఇప్పుడు మార్కెట్లో ఉన్న విద్యుత్తు స్కూటర్లలో ఇదే వినియోగదారులకు అందుబాటు ధరలో ఉంది.'' అని అన్నారు.