Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుమారం రేపిన కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : మాంద్యం దెబ్బతో లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో కేంద్ర కార్మిక, ఉపాది శాఖ మంత్రి సంతోశ్ గాంగ్వార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దేశంలో ఉద్యోగాల కొరతే లేదని ఆయన శనివారం ఉత్తరప్రదేశ్లో వ్యాఖ్యానించారు. కానీ, నైపుణ్యవంతులైన అభ్యర్థుల్లేరని కొత్త వివాదానికి తెరలేపారు. 'నిరుద్యోగానికి సంబంధించిన వార్తలూ ప్రతిరోజు పత్రికల్లో ప్రచురితమవుతున్నాయి. కానీ, ఉద్యోగాలకు కొరతే లేదు. నేను దానికి సంబంధించిన శాఖకే మంత్రిని. రోజూ ఈ అంశాన్ని పరిశీలిస్తుంటాను. ఈశాన్య రాష్ట్రాల్లో నియామకం జరిపేవాళ్లు నాతో ఏమన్నారంటే.. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు అభ్యర్థుల్లో ఉండట్లేవన్నారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. 'మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేండ్లు దాటింది. ఇప్పటికీ ఉపాధిని సృష్టించింది లేదు. ఇక మీ చర్యలతో నెలకొన్న ఆర్థిక మాంద్యంతో ఉద్యోగుల ఉపాధి కూడా పోతున్నది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలను అవమానించి సమస్య నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా?' అంటూ మండిపడ్డారు. దేశంలో 45 ఏండ్లలో గరిష్టంగా నిరుద్యోగం నెలకొందన్న చర్చ జరుగుతున్న సందర్భంలో కేంద్ర మంత్రి పై విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం.