Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19న కూకట్పల్లిలో మరో మాల్ ప్రారంభం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రానున్న రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా తమ వ్యాపారాన్ని భారీగా విస్తరించాలని యోచిస్తున్నట్టుగా మాంగళ్య షాపింగ్ మాల్స్ చైర్మెన్ కాసం నమశ్శివాయ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ తమ సంస్థ టర్నోవర్ రూ.500 కోట్లకు చేరువైంది అని అన్నారు. ఇందులో దాదాపు రూ.400 కోట్ల మేర ఆదాయం హైదరాబాద్ నుంచే లభిస్తోందని తెలిపారు. నగరంలో విస్తరణ ప్రణాళికతో భాగంగా తమ సంస్థ గురువారం (19న) కూకట్పల్లిలో మరో భారీ మాల్ను ప్రారంభించనుందని తెలిపారు. ఇది తమకు ఐదో మాల్ కానుందని ఆయన అన్నారు. గరిష్టంగా దాదాపు రూ.15 కోట్ల వ్యయంతో తాము ప్రతి స్టోర్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. టెక్స్టైల్ పార్క్లో తాము భాగస్వాములం కావాలని యోచిస్తున్నామన్నారు. ఇందుకు గాను రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలిపారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో దాదాపు 25000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కొత్త మాల్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఇది తమకు రాష్ట్రంలో ఏడో మాల్ కానుందని అన్నారు. తాము 1942 నుంచి వస్త్ర వ్యాపారంలో ఉన్నామని.. నాణ్యతకు మారుపేరుగా వ్యాపారం చేస్తుండడం వల్లే తమను వినియోగదారులు విశ్వసిస్తూ వస్తున్నారని తెలిపారు. తమ మాల్స్లో స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిల్లలు సకుటుంబ సమేతంగా షాపింగ్ చేయవచ్చని, అన్ని శుభకార్యాలకు సరిపడా వస్త్ర ప్రపంచం మాంగళ్య అని సంస్థ ఒక పత్రికా ప్రకటనలో వివరించింది.