Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను అమ్మేసే ప్రక్రియను సర్కారు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 10వ తేదీ నుంచి సంస్థ విక్రయానికి సంబంధించి బహిరంగంగా సర్కారు బిడ్లను ఆహ్వనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎయిరిండియాలో కొంత వాటాను విదేశీ విమానయాన సంస్థకు విక్రయించే అవకాశం ఉన్నట్టు సర్కారులోని కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎయిరిండియాలో స్వల్ప వాటాను విదేశీ సంస్థకు అమ్మేసే దిశగా కార్యాచరణ ముందుకు సాగుతోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఇందులో భాగంగా సంస్థకు ఉన్న మొత్తం రుణ భారంలో దాదాపూ రూ.30,000 కోట్ల అప్పును సర్కారు విడదీసిన ప్రత్యేక హోల్డింగ్ కంపెనీకి బదిలీ చేసింది. దీంతో ఇప్పుడు ఎయిరిండియా సంస్థ ఖాతాలో దాదాపు మరో రూ.30000 కోట్ల వరకు మాత్రమే రుణ భారం ఉండనుంది. త్వరలో ఎయిరిండియా విక్రయానికి బిడ్లు ఆహ్వానించనున్న నేపథ్యంలో కొనుగోలు సంస్థలను ఆకర్షించేందుకే కేంద్రంలో మోడీ సర్కారు సంస్థ రుణ భారాన్ని ప్రత్యేక సంస్థకు బదిలీ చేశారన్న విమర్శలు వివనవస్తున్నాయి.