Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీ స్టాక్ మార్కెట్ల నష్టాలకు బుధవారం కాస్త బ్రేకులు పడ్డాయి. అంతకు ముందు రెండు రోజులుగా నష్టపోతూ వచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్ల బెంచ్మార్క్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కొంత శాంతించడం, మరో వైపు డాలరుతో పోలిస్తే రూపాయి బలపడటం వంటి అంశాలు మార్కెట్పై సానుకూల ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒకానొక సమయంలో 248 పాయింట్ల మేర పైకి కదిలింది. నిఫ్టీ కూడా 10,885 పాయింట్ల స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 0.19 శాతం తగ్గుదలతో 64.42 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 0.49 శాతం క్షీణతతో 58.80 డాలర్లకు తగ్గింది. అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలపడి 60 పైసలు లాభంతో ట్రేడయింది. రోజంతా71.19 వద్ద కదలాడింది. ఈ అంశం మార్కెట్లకు నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు, మెటల్ స్టాక్స్ పరుగు పెట్టడం సూచీలకు కలిసొచ్చింది. అనుకూల అంశాల నేపథ్యంలో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంతో 36,564 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 10,841 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50లో టాటా స్టీల్, బీపీసీఎల్, వేదాంత, గెయిల్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్ దాదాపు 4 శాతం పెరిగింది. అదేసమయంలో బ్రిటానియా, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్రిటానియా స్టాక్ దాదాపు 3 శాతం పడిపోయింది. నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్లు 1 శాతానికి పైగా పెరిగాయి.