Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మందగమనం కారణంగా అమ్మకాలు తగ్గి ఇబ్బంది పడుతోన్న దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సంస్థ కొత్త వాహనాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. హాచ్ బ్యాక్ కారు ఎస్-ప్రెస్సో వాహనాన్ని ఈ నెల (సెప్టెంబర్) 30న మార్కెట్లోకి ఆవిష్కరించేందుకు గాను సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు మారుతీ సుజుకీ సంస్థ మీడియాకు ఆహ్వానాలు పంపుతోంది. ఇటీవల ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఆటో ఎక్స్పో లో ఎంట్రీ లెవల్ కారుగా మారుతీ సుజుకీ ఈ వాహనాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. నాలుగు వేరియంట్లలో ఈ కారును మార్కెట్లోకి విడుదల చేస్తోంది. మారుతీ సుజుకి నుంచి స్పోర్టీ లుక్లో వుస్తున్న ఎస్-ప్రెస్సో ఫీచర్లపై అంచనాలు ఇలా వున్నాయి. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్, పవర్ 68హెచ్పి, టార్క్ 90 ఎన్ఎమ్, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికలతో మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.