Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (మహేశ్ బ్యాంక్) చైర్మెన్కు మేటి అవార్డు లభించింది. మహేశ్ బ్యాంక్ చైర్మెన్ పురుషోత్తందాస్ మందనకు 'బ్యాంకింగ్ ఫ్రాంటర్' సంస్థ అందించే ఉత్తమ చైర్మెన్ అవార్డు సొంతమైంది. ఇటీవల గోవాలో జరిగిన 'ఫ్రాంటైర్ కో-ఆపరేటివ్ బ్యాంకింగ్ అవార్డ్స్' (ఎఫ్సీబీఏ) ప్రదాన కార్యక్రమంలో గోవా రాష్ట్ర సహకార శాఖ మంత్రి గోవింద్ గౌడ, ఆర్బిఐమాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.ఎస్.దాస్, ఎన్ఏఎఫ్సీయూబీ అధ్యక్షుడు జ్యోతీంద్ర మెహతా చేతుల మీదుగా మహేశ్ బ్యాంక్ చైర్మెన్ పురుషోత్తందాస్ మందన ఈ అవార్డును అందుకున్నారు. గడిచిన మూడేండ్ల కాలంల ఆర్థిక లక్ష్యాలు, నిర్ధేశించుకున్న వృద్ధిని చేరువవ్వడానికి విధానాల రూపకల్పనతో పాటు సమర్థమంతమైన నాయకత్వంతో బ్యాంకులను వృద్ధి పథంలో ముందుకు సాగించేందుకు గాను మందన తీసుకున్న చర్యలను గుర్తించిన 'బ్యాంకింగ్ ఫ్రాంటర్' ఉత్తమ చైర్మెన్ అవార్డును అందించినట్టుగా ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. భారీ సహకార బ్యాంకుల విభాగంలో పురుషోత్తం దాస్కు ఈ అవార్డు లభించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. మహేశ్ బ్యాంక్ గడిచిన కొన్ని సంవత్సరాలుగా వివిధ అంశాల్లో కనబరుస్తున్న మేటి పనితీరుకు గుర్తింపుగా పలు అవార్డులు వస్తుండడం తమకు ఆనందంగా ఉందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.