Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గడిచిన ఆర్థిక సంవత్సరంలో టెక్స్టైల్ విభాగంలో రూ.3000 కోట్ల టర్నోవర్ సాధించినట్లు కేపీఆర్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ నటరాజ్ తెలిపారు. 2019-20 రెవెన్యూలో 15 శాతం వృద్ధి అంచనా వేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శక్తివెల్, అరుణ్తో కలిసి ఫోసో బ్రాండ్ కింద ప్రీమియం ఆర్గానిక్ ఇన్నర్వేర్ కలెక్షన్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్పత్తులను ఇటీవలే తమిళనాడు, కేరళలో విడుదల చేశామన్నారు. వచ్చే నెలలో దక్షిణాది మొత్తానికి అందుబాటులోకి తేనున్నామని తెలిపారు. 2020 నాటికి దేశ వ్యాప్తంగా ఆవిష్కరించడంతో పాటుగా పిల్లలు, మహిళల దుస్తులను కూడా తయారు చేయాలని నిర్దేశించుకున్నామన్నారు. 2022 నాటికి సొంత స్టోర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు.