Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వర్షన్లో మరో సెడాన్ కారును మార్కెట్లోకి తెచ్చింది. టిగోర్ ఈవీ (ఎలక్ట్రిక్ వెహకల్) సెడాన్ను సంస్థ బుధవారం మార్కెట్లోకి విడుదలచేసింది. ఈ కారు ప్రారంభ ధరను సంస్థ రూ. 9.44 లక్షలుగా నిర్ణయించింది. మూడు వేరియంట్లలో ఈ కారు లభ్యం కానుంది. ఈ కారులో 21.5 కిలోవాట్ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 213 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది గతంలో కంటే 71 కిలోమీటర్లు అదనం. ఇందులో రెండు చార్జింగ్ పోర్టులు ఉన్నాయి. ఫాస్ట్ చార్జింగ్ కోసం ఒకటి, స్లో చార్జింగ్ కోసం మరొకటని కంపెనీ తెలిపింది. అదనంగా ఎక్స్ఈ వేరియంట్లో రెండు ఎయిర్బ్యాగులు ఉన్నాయి. మూడు వేరియంట్లలో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టంతో పాటు ఇతర సేఫ్టీ ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. వీటితో సిగేచర్ ఈవీ డెకల్స్, ప్రీమియం ఫ్రంట్ గ్రిల్, స్టైలిష్ అలారు వీల్స్, హైట్ అడ్జబుల్ సీట్, అర్మాన్ సౌండ్ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ వాహనాలను కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు, క్యాబ్ నిర్వాహకులకు మాత్రమే విక్రయించేది. ఇక నుంచి వ్యక్తిగత వినియోగదారులు కూడా ఈ వాహనాలను కొనుగోలుచేయవచ్చు అని కంపెనీ తెలిపింది.