Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోటీతత్వ సూచీలు 10 స్థానాలు కిందకు
- ఐటీ వాడకం అంతగా కనిపించడం లేదు
- ఆరోగ్యం, ఆయుర్దాయం ఆందోళనకరొం ఇతర ఆర్థిక వ్యవస్థలు మెరుగయ్యాయి
- భారత్లో నైపుణ్యత మరింతగా పెరగాలి
- కార్మికుల హక్కుల భద్రతా అంతంతగానే: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో పోటీతత్వం పడిపోయిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యుఈఎఫ్) తెలిపింది. జనీవా కేంద్రంగా పని చేస్తున్న డబ్ల్యుఈఎఫ్ తాజాగా రూపొందించిన 'గ్లోబల్ కాంపిటెటివ్నెస్ ఇండెక్స్' (ప్రపంచ పోటీతత్వ సూచీ-జీసీఐ)భారత్ 10 స్థానాలు దిగజారి 68 ర్యాంకింగ్కు పడిపోయింది. భారత్తో పోలిస్తే ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు మెరుగైన ప్రదర్శనతో దూసుకుపోవడంతో పాటు పలు విషయాల్లో ఇండియా పనితీరు ప్రోత్సాహకరంగా లేని కారణంగా ర్యాంకింగ్ తగ్గిందని డబ్ల్యుఈఎఫ్ వెల్లడించింది. ఇన్ఫర్మెషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీని విరివిగా వినియోగించుకోవడం, ఆర్యోగ పరిస్థితుల దుర్బరంగా ఉండడం వంటి పలు కారణాలు భారత ర్యాంకింగ్పై ప్రభావం చూపిందని డబ్లుఈఎఫ్ వివరించింది. ప్రపంచ పోటీతత్వ జాబితాలో అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టుతూ సింగపూర్ అగ్రస్థానానికి చేరిందని డబ్ల్యుఈఎఫ్ వెల్లడించింది. మరోవైపు బ్రిక్స్ దేశాలతో పోలిస్తే బ్రెజిల్ (71వ ర్యాంక్) తరువాత భారతే అత్యల్ప ర్యాకింగ్ను పొందిందని సంస్థ వివరించింది. భారత బ్యాంకింగ్ వ్యవస్థలో బలహీన పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థలో పలు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ సూక్ష్మ గణాంకాలలో స్థిరత్వం, మార్కెట్ సైజ్ విషయంలో భారత్ మంచి ర్యాకింగ్లో నిలిచిందని డబ్ల్యుఈఎఫ్ వివరించింది. మార్కెట్ సైజ్ విషయంలో భారత్ మూడో స్థానంలోను, కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో 15వ స్థానంలోను, షేర్హోల్డర్ల గవర్నెన్స్ విసయంలో రెండో స్థానంలోను నిలిచినట్టుగా డబ్ల్యుఈఎఫ్ విశ్లేషించింది. కొత్త పరిశోధనలు (ఇన్నోవేషన్స్) విభాగంలోనూ భారత్ మెరుగైన ప్రదర్శనను కనబరిచిందని సంస్థ తెలిపింది. ఈ విషయంలో చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే కూడా మెరుగైన స్థానంలో ఉందని పేర్కొంది. ఇన్నోవేషన్స్ విషయంలో చాలా అభివృద్ధి చెందిన దేశాలతో సరిసమానంగా భారత్ ముందుకు సాగుతోందని విశ్లేషించింది. భారత్లో జీవన ఆయుర్దాయం తక్కువగా ఉండడం కూడా ర్యాంకింగ్ను ప్రభావితం చేసినట్టుగా డబ్ల్యుఈఎఫ్ వివరించింది. మొత్తం 141 దేశాల ఆర్యోగం, జీవన ఆయుర్దాయం విషయాన్ని విశ్లేషించి చూస్తే భారత్ 109వ స్థానంలో నిలిచినట్టుగా సంస్థ తెలిపింది. చీకటి ఖండంలోని ఆఫ్రికా దేశాల వెలుపల ఉన్న కొన్ని దేశాల కంటే భారత్లో ఈ పరిస్థితులు దారుణంగా ఉన్నట్టుగా సంస్థ విశ్లేషించింది. భారత్ నైపుణ్యత పెంపు విషయంలో దృష్టి పెట్టాల్సి అవసరం ఎంతైనా ఉందని డబ్ల్యుఈఎఫ్ ట్రేట్ ఒపెన్నెస్ లోపించడం వల్ల భారత మార్కెట్ సామర్థ్యం తక్కువగా ఉంటూ వస్తోందని పేర్కొంది. కార్మికుల హక్కులకు భద్రత, తగినంతగా అభివృద్ధి చెందిన క్రియాశీలక మార్కెట్ విధానాలు లేకపోవడం కూడా భారత ఆర్థిక వ్యవస్థ ర్యాంకింగ్పై ప్రభావం చూపుతూ వస్తోందని డబ్ల్యుఈఎఫ్ వెల్లడించింది. భారత్లో స్త్రీ, పురుష కార్మికుల నిష్పత్తి 0.26గా నిలిచిందని. ఈ విషయంలో భారత్ 128వ స్థానంలో నిలుస్తోందని ఈ సంస్థ విశ్లేషించింది. మొత్తం ర్యాకింగ్ల విషయంలో భారత్ భారత ఇరుగుపొరుగు దేశాలైన శ్రీలంక 84వ స్థానంలోను, బంగ్లాదేశన 105వ స్థానంలో, నేపాల్ 108వ స్థానంలో, పాకిస్థాన్ 110వ స్థానంలోను నిలిచినట్టుగా డబ్లుఈఎఫ్ తెలిపింది.