Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమన పరిస్థితులను దూరం చేసేందుకు గాను ప్రభుత్వ చేపడుతున్న చర్యలతో స్థిరాస్తి రంగానికి పెద్దగా కలిసొచ్చేదేమీ ఉండదని ప్రముఖ స్థిరాస్తి సంస్థ సుమధుర గ్రూపు చైర్మెన్, ఎండీ జి.మదుసూదన్ అభిప్రాయపడ్డారు. వడ్డీరేట్లు తగ్గించినంత మాత్రాన స్థిరాస్తి రంగంలో వృద్ధి నమోదు కాదని ఆయన అన్నారు. స్థిరాస్తి ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు లభించేలా ప్రభుత్వాలు సింగిల్ విండో విధానాన్ని అందుబాటులోకి తేవాలని.. దీనికి తోడు ప్రజల్లో విశ్వాసం నింపేచర్యలనూ చేపడితేనే లాభమని ఆయన అన్నారు. శుక్రవారం సంస్థ కొండాపూర్లో చేపట్టతలపెట్టిన 'సుమధుర హారిజన్' ప్రీమియర్ రెసిడెన్షియల్ ప్రాజెక్టును ఆయన ఆవిష్కరించారు. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో తాము ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టుగా ఆయన వివరించారు. దాదాపు 5.04 ఎకరాలలో నాలుగు టవర్ల రూపంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్టుగా తెలిపారు. ఇందులో 2, 3, 5 పడుక గదులను నిర్మించనున్నట్టుగా తెలిపారు. వీటి సైజ్ 1325-2710 చ.అడుగుల మేర ఉండనున్నట్టుగా తెలిపారు. ఐటీ హబ్కు చేరవగా ఉండడంతో పాటు, రవాణా వ్యవస్థకు అనుకూలంగా ఉండే ప్రాంతంలో దీనిని నిర్మిస్తున్నట్టుగా ఆయన వివరించారు.