Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యాలయంలో ఐటీ అధికారుల సోదాలు
- ఇది రొటీన్ చెక్ అంటున్న కంపెనీ వర్గాలు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ప్రముఖ నిర్మాణ కంపెనీ మెఘా ఇంజనీరింగ్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ కార్యాలయంపై ఆదాయపుపన్ను శాఖ(ఐటీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును మేఘా సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఈ సంస్థనే చేపడుతున్నది కాగా హైదరాబాద్లోని మేఘా సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు శుక్రవారం ఉదయం వచ్చి సోదాలను నిర్వహించినట్టు తెలిసింది. కేవలం హైదరాబాద్లోని కార్యాలయంలో మాత్రమే ఐటీ సోదాలు జరిగాయని సమాచారం. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుతో రెండు రాష్ట్రాలకు చెందిన సీఎంలకు దూరం పెరిగిన నేపథ్యంలోనే ఈ ఐటీ సోదాలు జరిగినట్టుగా రాజకీయ వర్గాలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్లోని తమ సంస్థ కార్యాలయంలో ఐటీ అధికారులు వచ్చిన మాట నిజమేనని, కానీ అవి సోదాలు కావని మేఘా ఇంజనీరింగ్కంపెనీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తమ సంస్థకు చెందిన ఇతర ప్రాంతాలలోని రీజినల్ కార్యాలయాలలో ఎక్కడ కూడా ఐటీ సొదాలు జరగలేదని చెబుతున్నాయి. గత ఇరవై ఏండ్లుగా తమ సంస్థ ఐటీకి చెల్లించాల్సిన పన్నులను సక్రమంగా చెల్లిస్తున్నదని, రొటీన్ అక్కౌంట్స్ తనిఖీలో భాగంగానే ఐటీ అధికారులు వచ్చారని ఆ వర్గాలు తెలిపాయి. కాగా ఐటీ వర్గాలు మాత్రం మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కార్యాలయానికి తమ అధికారులు వెళ్లిన మాట నిజమేనని పేర్కొన్నాయి.