Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు, దివాలాదారులకు రుణరద్దులా..
- పొదుపు సొమ్ము భద్రతకు విధానాలే కరువు
- ప్రజల సొమ్ము దుర్వినియోగం మహాపాపొం వ్యవస్థలో పొదుపు తగ్గుతుడడం ప్రమాదం: హెచ్డీఎఫ్సీ చైర్మెన్ దీపక్ పరేఖ్
ముంబయి: సామాన్య ప్రజలు పొదుపు చేసి దాచుకునే సొమ్ముకు భద్రత కలిగించేలా దేశంలో తగిన ఆర్థిక విధానాలే అందుబాటలో లేకుండా పోవడం చాలా అన్యాయమని హెచ్డీఎఫ్సీ చైర్మెన్ దీపక్ పరేఖ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అప్పులు చెల్లించలేక చేతులెత్తేసిన వారికి రుణామాఫీలు, కార్పొరేట్ రుణాల మాఫీకి నిర్ధిష్టమైన విధానాలు ఉన్నప్పటికీ కష్టపడి డబ్బులు దాచుకొనే సామాన్యులు విత్త సంస్థల్లో పొదుపు చేస్తే వాటికి భరోసా లేకుండా పోయిందని ఆయన అన్నారు. దేశంలో సామాన్య ప్రజలు పొదుపు చేసి దాచుకునే సొమ్ముకు భద్రత కలిగించేలా దేశంలో తగిన ఆర్థిక విధానాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. పీఎంసీ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. తన దృష్టిలో సమాన్య ప్రజలు కష్టపడి సంపాదించుకుని, దాచుకున్న సొమ్మును దుర్వినియోగం చేయడం కంటే మహాపాపం మరోకటి లేదని ఆయన అన్నారు. ఇక్కడ ఎస్పీ జైన్ బిజినెస్ స్కూల్లో ఏర్పాట చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పొదుపు రేటు జీడీపీలో 30 శాతానికి చేరిందని.. గడిచిన దశాబ్ద కాలంగా దీనిని పరిశీలించి చూస్తే ఇది తగ్గుతూ వస్తోందని అన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిదికాదని హెచ్చరించారు. ప్రజల్లో పొదుపును పెంచాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. పొదుపు పెరిగితేనే.. విస్తారంగా రుణాలు ఇచ్చేందుకు వీలు కలుగుతుందన్న అంశాన్ని అందరూ గుర్తించాలని కోరారు. దేశంలోని ప్రజలు తమ పొదుపు సొమ్ముపై నిర్ధిష్టమైన రిటర్న్లను కోరుకుంటారని.. అందుకే ఎఫ్డీలు బ్యాంకుల పొదుపుల్లో అగ్రస్థానంలో ఉంటూ వస్తాయని అన్నారు.