Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఫ్యాబ్ఇండియా సంస్థ హైదరాబాద్లో తన రెండో ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. గచ్చిబౌలిలో దాదాపు 8,829 చదరపు అడుగుల వస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేసినట్టుగా సంస్థ ఎండీ వినరు సింగ్ తెలిపారు. సంస్థకు ఇది నగరంలో రెండో ఎక్స్పీరియన్స్ కేంద్రమని ఆయన తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కేంద్రాన్ని వినూత్నంగా అందుబాటులోకి తెచ్చినట్టుగా ఆయన వివరించారు. ఇప్పటికే సంస్థ ఢిల్లీ, ఛండీగఢ్, అమృత్సర్, జైపూర్, ఇండోర్, ఆగ్రా, చెన్నరు, బొంబయి, పుణె, బెంగళూరు నగరాలలో సంస్థకు ఎక్స్పీరియన్స్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని నగరాలలో ఇలాంటి వాటిని ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. ఈ కేంద్రంలో ఫ్యాబ్ కేఫ్, ఇంటీరియర్ డిజైన్ స్టూడియో, ఆర్గానిక్ వెల్నెస్ సెంటర్, ఆల్టరేషన్ స్టూడియో, కిడ్స్జోన్లను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా తమ సంస్థ కార్యకలాపాలను వేగంగా విస్తరంచిడంపై దృష్టి పెడుతున్నట్టుగా ఆయన తెలిపారు.