Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముక మొబైల్స్ తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ సరికొత్త స్మార్ట్ఫోన్ నోకియా 6.2ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. 6.39 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై (అప్గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 10) ఆపరేటింగ్ సిస్టమ్, 16, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి చార్జర్, 3500 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఈఫోన్ ప్రత్యేకతలు.ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.15,999గా నిర్ణయించింది. వెనుక భాగంలో హైఎండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రత్యేక ఆకర్షణ. డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్డీ స్లాట్లను ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు. వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్ బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్, 4జీ ఎల్ టీఈ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ పొడవు 15.99 సెంటీమీటర్లు కాగా, వెడల్పు 8.87 సెంటీమీటర్లు గానూ, మందం 0.82 సెంటీమీటర్లుగానూ ఉంది. ఇక బరువు వచ్చి 180 గ్రాములు. అద్భుతంగా తయారైన ఈ ఫోన్ ను వినియోగదారులకు చేర్చి వారి స్పందన వినడానికి ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు ఈ ఫోన్ లాంచ్ సందర్భంగా హెచ్ ఎండీ గ్లోబల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అజరు మెహతా అన్నారు.