Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 1 నుంచి 11వ తేదీ వరకు..
న్యూఢిల్లీ : ఈ నెల 1 నుంచి 11వ తేదీ వరకు మన దేశ మార్కెట్లలో నుంచి 6,200 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. ఫారీన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్(ఎఫ్పీఐ)ల రూపంలోని ఈ పెట్టుబడులను మదుపరులు వెనక్కి తీసుకున్నారు. అంతర్జాతీయంగా మాంద్యం ఛాయలు ఏర్పడటం, వాణిజ్య యుద్ధ వాతావరణంతో ఈ రెండు వారాల్లోనే 6,200 కోట్ల ఎఫ్పీఐలు తిరిగివెళ్లాయి. మదుపరులు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 4,955.2 కోట్లు, డెట్ సెగ్మెంట్ నుంచి రూ. 1,261 కోట్లను విదేశీ మదుపరులు ఉపసంహరించుకున్నారు. ఈ నెలలో విదేశీ పెట్టుబడులు సుప్తావస్థ స్థితిలోకి వెళ్లాయని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ సీనియర్ అనలిస్ట్ మేనేజర్ రీసెర్చ్ హిమాంశు శ్రీవాస్తవ అన్నారు.