Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బ్యాంకు(పీఎస్బీ)ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులతో నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ కానున్నారు. గతంలో బ్యాంకులకు జారీ చేసిన ఆదేశాలపై సమీక్ష జరపనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీ), ఎంఎస్ఎంఈ(సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు)లకు నిధుల లభ్యతకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు గతనెల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఎంఎస్ఎంఈల అప్పులను 2020 మార్చి 31 వరకు ఎన్పీఏలుగా పరిగణించొద్దని సూచించారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో పండుగ సందర్భంగా అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు పరపతిని అందుబాటులో ఉంచాలని సూచించారు. వీటితోపాటు, లోన్మేళాకు సంబంధించిన కార్యక్రమాల పురోగతిపై నేడు చర్చ జరగనున్నట్టు సమాచారం.