Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్కుక్
తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తి రంగంలో ముందు వరుసలో ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడి అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని పాములపర్తి శివారులోని కావేరి సీడ్స్ కంపెనీ ఫర్ అప్లర్డు జెనమిక్స్ అండ్ సీడ్ టెక్నాలజీ పరిశోధనా కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్రం అంతర్జాతీయ విత్తన భాండాగారంగా తయారయ్యేందుకు రైతులందరూ విత్తన ఉత్పత్తి పంటలు పండించాలని, ఆర్థికాభివృద్ధి సాధించాలని అన్నారు. రాష్ట్రంలో ఉష్ణం, శీతలం అన్నీ సమపాలల్లో ఉన్నందు వల్లే తెలంగాణ విత్తనోత్పత్తికి కేంద్రంగా మారుతోందన్నారు. ఈ విత్తన భాండాగారంలో విత్తనాల నాణ్యత, రోగనిరోధక శక్తిని తట్టుకునేలా తయారు చేస్తున్నట్టు తెలిపారు. కావేరి సీడ్స్ కంపెనీ పరిశోధన సంస్థలోని పలు బ్లాకుల్లో విత్తన పరిశోధన చేపట్టే విధానాలను మంత్రులకు కంపెనీ ప్రతినిధులు, పరిశోధకులు వివరించారు. తర్వాత కంపెనీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి, వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ భాస్కర్ రావు పాల్గొన్నారు.