Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశంలో అధునాతన ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థల మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని సీపీ ప్లస్ సంస్థ సీఈవో, ఎండీ ఆధిత్య కేమ్కా అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న అవసరాల మేరకు సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తాము సన్నద్ధమవుతున్నట్టుగా ఆయన వివరించారు. రానున్న రోజుల్లో మధ్య ప్రాచ్య, ఆగేయాసియా, దక్షిణ అమెరికా మార్కెట్లకు ఎగుమతులు జరిపేలా సంస్థ ఉత్పత్తిని పెంచనున్నట్టుగా ఆయన తెలిపారు. జాతీయ ఎలక్ట్రానిక్స్ పాలసీ-2109 ప్రకారం 100 శాతం స్థానికతకు ప్రాధ్యానతనిచ్చేలా తాము ఎగమతి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. తాజా పెట్టుబడులతో ఉత్పత్తి పెంపుదల వల్ల తెలుగు రాష్ట్రాలలో కాంపోనెన్ట్ల అభివృద్ధి, పీసీబీ తయారీ, ఎలక్ట్రానిక్ వ్యవస్థ అభివృద్ధి, తయారీ, క్వాలిటీ కంట్రోల్, రవాణా విభాగాల్లో కొత్త కొలువులు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. తిరుపతి విమానాశ్రయం సమీపంలో దాదాపు 20 ఎకరాలలో విస్తరించి ఉన్న తమ సంస్థలో దాదాపు 2000 మందికి ఉపాధి కల్పిస్తోందని అన్నారు. ఈ ప్లాంట్ వార్షిక తయారీ సామర్థ్యం 1.5 కోట్ల యూనిట్టుగా ఉందని ఆయన వివరించారు. ఉత్పత్తులపై నమ్మకం పెంచడం, తయారీ వ్యయాన్ని తగ్గించడం, ఏకీకృత పంపిణీ వ్యవస్థ, ప్రజలక చేరువ విధానాన్ని బలోపేతం చేయడం వంటి విషయాలపై దృష్టి సారిస్తున్నట్టుగా సంస్థ సీవోవో యోగేశ్ దత్తా తెలిపారు.