Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రానున్న సమీప భవిష్యత్తులో మొబైల్ చార్జీలు పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాల్స్ అన్నీ ఉచితంగా అందిస్తామంటూ మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో సంస్థ ట్రారు నిబంధనలను సాకుగా చూపి జియో నుంచి ఇతర నెట్వర్క్లకు చేసే కాల్స్పై చార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా మంగళవారం భారతీ ఎయిర్టెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) గోపాల్ విట్టల్ ఈ దిశగా సంకేతాలు అందించారు. ప్రస్తుతం అమలులో ఉన్న కాల్ చార్జీలు తమకు సరిపోవడం లేదని అన్నారు. ఇక్కడ జరుగుతున్న 'ఇండియా మొబైల్ కాంగ్రెస్'లో ఆయన మంగళవారం పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం టెలికాం రంగం ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటోందని.. దీనిని నుంచి బయటపడేందుక గాను చార్జీలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంటర్కనెక్ట్ యుసేజీ చార్జీలు (ఐయూసీి) చార్జీలకు సంబంధించి ట్రారు ప్రతిపాదిత పత్రం కోసం పరిశ్రమ ఎదురు చూస్తోందన్నారు. గత 20 ఏళ్లుగా ఐయూసీ చార్జీలను పరిశీలిస్తున్నామన్నారు. వ్యాపారంపై భారం పడుతున్నందున ప్రభుత్వ వర్గాలు వీటిని పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో టారీఫ్ల పెంపు యోచనపై మీడియా ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పడానికి ఆసక్తి చూపలేదు. కేంద్ర ప్రభుత్వం సూచన ప్రాయంగా ప్రతిపాదిస్తున్న 5జీ స్పెక్ట్రం ధరలు ఎక్కువగా ఉన్నాయని గోపాల్ విట్టల్ అన్నారు. 100 మెగాహెడ్జెస్ స్పెక్ట్రం ధరను రూ.50,000 నుంచి రూ.55,000 కోట్లుగా అంచనా వేస్తున్నారని.. ఇది చాలా ఎక్కువ ధర అని పేర్కొన్నారు. 700 ఎంహెచ్జడ్ ధరను ట్రారు తగ్గించినప్పటికీ ఇప్పటికీ ఈ ధర ఎక్కువగా ఉందన్నారు. 5జీ ధర మాత్రమే కాదని సబ్-గిగాహెట్జ్ ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయని వాపోయారు..