Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దసరా, దీపావళి పండుగ లను పురస్కరించుకొని ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయ చైన్ సంస్థ బిగ్'సి' ప్రకటించిన 'దసరావళి డబుల్ ధమాకా' ఆఫర్కు వినియోగ దారుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ ఆఫర్ తొలి డ్రాను బుధవారం హైదరాబాద్లో నిర్వ హించారు. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ బాలు చౌదరి మాట్లాడుతూ.. ఈ ఆఫర్లో భాగంగా ప్రతి 10 రోజులకు ఒక లక్కీడ్రా తీయబడుతుందని, మొత్తం 3 వారాల పాటు తీయబడే లక్కీడ్రాలతో విజేతలుగా ఎంపికైన కస్లమర్లకు 30 మారుతీ ఆల్టో కార్లు, 30 బజాజ్ ప్లాటినమ్ వాహనాలు బహుమతిగా అందిం చనున్నట్టుగా తెలిపారు. ఈ విధంగా 30 రోజుల్లో 60 బహుమతులను లక్కీడ్రా విజేతలకు అందించనున్నట్టుగా ఆయన వివరించారు. లక్కీడ్రాతో పాటుగా 10% హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్, స్వల్ప వాయిదా పద్దతిలో మొబైల్ కొన్న వారికి ఒక ఈఎంఐ ఉచితం, 30 శాతం వరకు పేటీఎం క్యాష్ బ్యాక్ సౌకర్యాలను అందిస్తున్నట్టుగా తెలిపారు. దీనితో పాటు ప్రతి మొబైల్ కొనుగోలుతో కచ్చితమైన బహుమతిని అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. బిగ్'సి'పై వినియోగదారుల్లో అపారమైన విశ్వాసం ఉందని.. దీనికి తోడు లక్కీడ్రాను కూడా సంస్థ అందుబాటులోకి తేవడంతో కస్టమర్లు ఆసక్తిగా తమ రిటైల్ అవుట్లెట్లలో మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.