Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో పట్టు నిలుపుకొనేందుకు దూకుడుగా ముందుకు సాగుతున్న రెడ్మీ సంస్థ తాజాగా మరో రెండు కొత్త మొబైల్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెడ్మీ నోట్ 8ప్రో, రెడ్మీ నోట్ 8 పేర్లతో ఈ ఫోన్లను మార్కెట్లోకి ఆవిష్కరించింది. గేమింగ్ను ఇష్టపడే వారి కోసం రెడ్మీ నోట్ 8ప్రో ఫోన్ను ప్రత్యేకంగా మార్కెట్లోకి తెచ్చినట్టుగా సంస్థ తెలిపింది. ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్తో పనిచేసే ఈ ఫోన్లో గేమర్స్ కోసం గేమ్ టర్బో 2.0 అనే మోడ్ను జోడించారు. దీనిలో లిక్విడ్ కూలింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఇది అధిక గ్రాఫిక్స్తో ఉన్నగేమ్స్ ఆడేటప్పుడు ఉత్పన్నమయ్యే వేడిని తగ్గిస్తుంది. 6.53 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేను దీనిలో అమర్చారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ను ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులో మొత్తం ఐదు కెమెరాలలను అమర్చారు. ముందువైపు 20 ఎంపీ సెల్ఫీ కెమెరాలు.. వెనకవైపు నాలుగు కెమెరాలు ఏర్పాటు చేశారు. 64 ఎంపీతో ప్రధామిక కెమెరాతో పాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలను ఇందులో అమర్చారు. మరో 2 మెగాపిక్సెల్ కెమెరాను ఫ్లాష్లైట్ కింది భాగంలో అమర్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సదుపాయం ఉంది. మూడు వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది. ఈ ఫోన్ రూ.14,999 నుంచి రూ.17,999 మధ్య లభించనుంది. రెడ్మీ నోట్ 8 ఫోన్ను సంస్థ క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్, 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ప్లేతో మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలన్ని అమర్చారు. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇస్తున్నారు. ఇంకా అల్ట్రావైడ్ లెన్స్తో 8 ఎంపీ కెమెరా, డెప్త్ సెన్పర్తో 2 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.