Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఒకప్పుడు ద్విచక్ర వాహన మార్కెట్లో రారాజుగా వెలుగొందిన బజాజ్ చేతక్ స్కూటర్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్కు సిద్ధమైంది. సరికొత్త రూపంలో చేతక్ స్కూటర్ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు బజాజ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారి చేతక్ ఎలక్ట్రిక్ వాహనంగా వినియోగదారుల చెంతకు రానుంది. కొత్త చేతక్ వాహనంలో ఐపీ 67 రేటింగ్ ఉన్న హైటెక్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. దీనిని 5-15 ఏఎంపీస్ ఎలక్ట్రికల్ అవుట్లెట్లో చార్జింగ్ చేసుకోవచ్చు. దీనిలో ఇంటెలిజెట్ బ్యాటరీ మేనేజ్మెంట్ వ్యవస్థను అమర్చారు. ఇది బ్యాటరీని నియంత్రిస్తుంది. దీనిలో ఎకో, స్పోర్ట్స్ అనే రెండు డ్రైవింగ్ మోడ్లు ఉండే అవకాశం ఉంది. స్కూటర్లో రీజనరేటీవ్ బ్రేకింగ్ వ్యవస్థను అమర్చారు. దీనిలోని ఫెదర్ టచ్ యాక్టివేటెడ్ ఎలక్ట్రానిక్ స్విచ్లు వాహనం ఆకర్షణను మరింత పెంచనున్నాయి. మల్టీస్పోక్ అలారు వీల్స్ దీనికి అందించనుంది. మొత్తం ఆరు రంగుల్లో చేతక్ మార్కెట్లోకి రానుంది. భారత మార్కెట్లో దీనిని విడుదల చేశాక యూరప్ మార్కెట్లకు పరిచయం చేయాలని బజాజ్ ప్లాన్ చేస్తోంది. దీనిని బజాజ్ చకన్ ప్లాంట్లో తయారు చేయనున్నారు. జనవరి 2020 నుంచి మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని ధరకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కానీ, సుమారు రూ.1.5లక్షల వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.