Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లాస్టిక్ వినియోగానికి చెక్ చెప్పేలా ఉత్పత్తి
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న జినోమీల్యాబ్స్ మార్కెట్లోకి తినే కప్పులను అందుబాటులోకి తెచ్చింది. దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతూ పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ముప్పు పెరుగుతున్న వేళ.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా సంస్థ 'ఈట్ కప్'ను మార్కెట్లోకి తెచ్చింది. గురువారం ఏర్పాటు చేసిన ఒక క్యాక్రమంలో భాగంగా పర్యావరణ అనుకూలమైన ఈట్కప్లను సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ రాజు ఆవిష్కరించారు. పూర్తిగా ఆహారోత్పత్తుల నుంచి లభించే పీచు పదార్థాలతో రూపొందించిన ఈట్కప్ 85 డ్రిగీల వరకు వేడిమిని, తేమను తట్టుకొని నిలుస్తుందని అన్నారు. కాఫీ, టీ, డోనట్, ఐస్క్రీమ్లను సేవించిన తరువాత మిగిలిపోయే కప్ను తినేందుకు వీలుగా తాము తయారు చేసినట్టుగా తెలిపారు. దీని ధరను ప్రస్తుతం రూ.25ల దరిదాపుల్లో ఉంచుతున్నామని.. రానున్న రోజుల్లో దేశీయంగానే ఉత్పత్తిని ప్రారంభించాక ఈ కప్ ధర రూ.10లోపు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ కప్ల ఉత్పత్తిని తాము లాభాలను ఆర్జించి చేపట్టడం లేదని.. పర్యావరణ హితం కోరుతూ వీటిని వాడకంలోకి తెస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంలో రానున్న 10-12 నెలల్లో శామీర్పేట్లో ఏర్పాటు చేయదలచిన ప్లాంట్ నుంచి రోజుకు పది లక్షల కప్పుల ఉత్పిత్తి చేపట్టనున్నట్టుగా తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు గాను ఇప్పటికే దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేశామని.. రానున్న రోజుల్లో రూ.20 కోట్ల వ్యయంతో మిషినరీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.