Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశంలో అపర కుబేరుడైన ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) సరికొత్త రికార్డును సాధించింది. రూ.9 లక్షల కోట్ల మార్కెట్ విలువను అందుకున్న తొలి భారతీయ సంస్థగా ఆర్ఐఎల్ అవతరించింది. బాంబే స్టాక్ మార్కెట్లో శుక్రవారం జరిగిన ట్రేడింగ్లో కంపెనీ మార్కెట్ విలువ ఒక దశలో రూ.9,01,490 కోట్లు నమోదైంది. షేర్ల విలువ రెండు శాతం మేర పెరిగి ఒక్కో షేరు ధర ఇంట్రా డేలో రూ.1,423కు చేరుకుంది. 2018 ఆగస్టులో రిలయన్స్ ఇండిస్టీస్ రూ.8 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించింది. కంపెనీల మార్కెట్ విలువ సూచీ స్టాక్ మార్కెట్ ధరల ఆధారంగా ప్రతిరోజు మారుతూ ఉంటుంది. పెట్రో కెమికల్స్ వ్యాపారంలో నెలకొన్న బలహీనతల్ని పరిష్కరించడం కోసం తీసుకొన్న చర్యలు, కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయంతో రిటైల్, టెలికాం వ్యాపారాలకు కలిసొచ్చే అవకాశం ఉండడం లాంటి సానుకూల సంకేతాలు షేరు విలువ పెరుగుదలకు కారణమైనట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఆర్ఐఎల్ సంస్థ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో భారీ లాభాలన ప్రకటించంది. జులై-సెప్టెంబరు మధ్య కాలంలో సంస్థ లాభం రూ.11,262 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే లాభంలో దాదాపు 18.30 శాతం వృద్ధి నమోదు అయింది. రిటైల్తో పాటు చమురు వ్యాపారం వల్ల అందిన మేటి మార్జిన్లతో సంస్థ మెరగున లాభాలను నమోదు చేయగలిగింది. దీంతో రిలయన్స్ ఇండిస్టీస్ సంస్థ గతంలో ఎన్నిడూ లేని విధంగా లాభాలను ఆర్జించేందుకు పలు అనుకూలతలు కూడా కలిసి వచ్చినట్టుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.