Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శనివారం విస్తృత తనిఖీలను చేపట్టారు. సన్బ్లింక్ డెవలపర్స్కు ఇచ్చిన రుణంపై సమాచారం సేకరించేందుకు ఈ సోదాలు నిర్వహించినట్టుగా సమాచారం. గ్యాంగ్స్టర్ ఇక్బాల్ మెమన్(ఇక్బాల్ మిర్చి)తో ఆస్తుల లావాదేవీలు జరిపినట్లు సన్బ్లింక్ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. 2010లో సన్బ్లింక్ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ నుంచి రూ.22 కోట్లు రుణం అందుకున్నట్లు ఈడీ తనిఖీల్లో తేలింది. తొమ్మిదేళ్లలో ఈ మొత్తం రూ.2,186 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో రెండు సంస్థల మధ్య సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది.