Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ ఆల్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ దేశంలో భారీగా విస్తరించాలని యోచిస్తోంది. తన ప్రత్యర్థులకు దీటుగా వినియోగ దారులకు సేవలందించడంతోపాటు, దేశీయంగా భారీగా కొత్త కొలువులను అందుబాటులోకి తేవాలని ఈ సంస్థ భావిస్తోంది. గిగాబైట్స్ వార్షిక టెక్ కాన్ఫరెన్స్లో స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీ మాట్లాడుతూ రానున్న18 నెలల్లో 3 లక్షల మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్టుగా తెలిపారు. దీంతో తనఉద్యోగుల బలాన్ని 5 లక్షలకు తీసుకెళ్లాలని భావిస్తున్నామన్నారు. ఇది వాస్తవ రూపం దాలిస్తే దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తున్న మూడవ అతిపెద్ద ప్రయివేటు రంగ సంస్థగా స్విగ్గీ అవతరిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న రీతిలోనే తమ వృద్ధి అంచనాలు కొనసాగితే, ఆర్మీ, రైల్వేల తరువాత దేశంలో మూడవ అతిపెద్ద ఉపాధి వనరుగా మారడానికి తమకు ఎన్నో ఏళ్లు పట్టదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రాబోయే 10-15 సంవత్సరాల్లో 100 మిలియన్ల కస్టమర్లు ప్రతి నెలా 15 రెట్లు తమ ప్లాట్ఫాంపై లావాదేవీలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మెజెటీ చెప్పారు. 2018 మార్చి గణాంకాల ప్రకారం ఇండియన్ ఆర్మీ 12.5 లక్షల ఉద్యోగులతో మొదటి స్థానంలో ఉండగా, భారతీయ రైల్వే 12 లక్షలతో రెండవ స్థానంలో ఉంది.