Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 467 కోట్లు రాబట్టే యోచనలో ఎస్బీఐ
న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 11 మొండి రుణాల ఖాతాలకు సంబంధించిన ఖాతాలను ఈ-వేలం వేయనుంది. వచ్చే నెల 7న ఈ వేలం నిర్వహించి రూ. 466.49 కోట్లను రాబట్టేందుకు యోచిస్తున్నది. రెగ్యులేటరీ ప్రతిపాదనల ప్రకారం సవరించిన ఆర్థిక ఆస్తుల విక్రయాల బ్యాంకు నిబంధనలకు లోబడి 11 ఖాతాలను ఏఆర్సీలు, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఎఫ్ఐలకు అమ్మేయనున్నట్టు ఎస్బీఐ వేలం నోటీసులో పేర్కొంది. ఈ ఖాతాలకు సంబంధిచిన ఆర్థిక ఆస్తులను ఈ నెల 12న ప్రదర్శించారు. కాగా, వాటి వేలం వచ్చే నెల 7న జరగనుంది. వేలం వేయనున్న ఎన్పీఏ ఖాతాల్లో భాటియా గ్లోబల్ ట్రేడింగ్(విలువ రూ. 177.02 కోట్లు), భాటియా కోక్ అండ్ ఎనర్జీ లిమిటెడ్(రూ. 1.4.15 కోట్లు), భాటియా కోల్ వాషరీస్(రూ. 12.58 కోట్లు), ఏషియన్ నేచురల్ రీసెర్సెస్ ఇండియా(రూ. 2.18 కోట్లు), మహారాష్ట్ర స్టీల్ ప్రయివేటు లిమిటెడ్(రూ. 40.51కోట్లు), అన్షుల్ స్టీల్ లిమిటెడ్(రూ. 37.70 కోట్లు), విధాత మెటల్స్(రూ. 36.98 కోట్లు)లు సహా మరికొన్ని ఖాతాలున్నాయి. వీటిని వచ్చే నెల 7న ఎస్బీఐ ఈ-వేలం వేయనుంది.