Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్థిక సమస్యలతో రాకపోకల్ని నిలిపేసిన వైమానిక సంస్థ జెట్ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దూబే గో ఎయిర్ సంస్థకు సలహాదారుడిగా నియామకమయ్యారు. జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాల్ని ముగించిన నెల రోజుల తర్వాత వినరు దూబే సీఈవో ఉద్యోగానికి రాజీనామా చేశారు. గో ఎయిర్లో మార్చి నెల నుంచి ఖాళీగా ఉన్న సీఈవో పోస్టుకు వినరు దూబేను నియమించుకునేందుకు ఆ సంస్థ భావించినట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. కానీ, జెట్ఎయిర్వేస్ కేసులో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. వినరు దూబేకు లుక్ఔట్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. దీంతో గో ఎయిర్కు సీఈవోగా వినరు దూబేను నియమించుకుంటే న్యాయపరమైన చిక్కులు వచ్చే ప్రమాదమున్నందున ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదని కొన్ని వర్గాలు వివరించాయి. అందుకే గో ఎయిర్కు సలహాదారుడిగా నియమించుకు న్నట్టు తెలిపాయి. అంతేకాదు, గో ఎయిర్ సంస్థ బోర్డులోకి గతవారం వినరును తీసుకున్నట్టు చెప్పాయి. అయితే, గో ఎయిర్కు సలహాదారుడి గా వినరు దూబే ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. జెట్ఎయిర్వేస్లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆ సంస్థ చైర్మెన్ అప్పటి ప్రమోటర్ నరేశ్ గోయల్, వినరు దూబేలకు సర్కారు లుక్ ఔట్ సర్క్యూలర్లు జారీ చేసింది.