Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చాలా దేశాలు వ్యతిరేకంగానే ఉన్నాయి : నిర్మలా సీతారామన్
వాషింగ్టన్ : క్రిప్టో కరెన్సీ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అనేక దేశాలు అభిప్రాయపడు తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్), వరల్డ్ బ్యాంక్ల వార్షిక సమావేశంలో ఫేస్బుక్ ప్రతిపాదించిన క్రిప్టో కరెన్సీ లిబ్రాపై చర్చ జరిగింది. ఈ సమావేశానంతరం వాషింగ్టన్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సహా పలువురితో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్రిప్టో కరెన్సీ చర్చా సమయంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారనీ, అయితే, చాలా దేశాలు ఈ కరెన్సీపట్ల జాగ్రత్తగా మసులుకోవాలన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేశాయని చెప్పుకొచ్చారు. మనదేశంలో క్రిప్టో కరెన్సీ వినియోగంపై ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అలాగే, అమెరికా, భారత్ మధ్య వాణిజ్యపరమైన చర్చలు వేగంగా సాగుతున్నాయని వివరించారు. ఇరుదేశాలు పరస్పరం దిగుమతులపై విధిస్తున్న సుంకాలపైనా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నదనీ తేలినా.. ఐఎంఎఫ్ సహకారాన్ని అందించడంపై భారత్ కాస్త కటువుగానే స్పందించింది. ఐఎంఎఫ్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలనీ, లేదంటే దాని లక్ష్యం దెబ్బతినే ప్రమాదమున్నదని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.