Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: అందు బాటు ధరల్లో మధ్య తరగతికి గృహ సదుపాయాన్ని అందించే ఉద్దేశంలో ప్రముఖ రియల్ కంపెనీ లాల్భారు గ్రూపు అనుబంధ సంస్థ అరవింద్ స్మార్ట్స్పేస్ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా సంస్థ హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్తో జట్టు కట్టింది. మధ్య తరగతి వారికి నాణ్యమైన ఇండ్లను సరసమైన ధరలకు అందించే ఉద్దేశంతో చేపట్టనున్న డెవలప్మెంట్స్ను స్పెషల్ పర్పస్ వెహికల్ కింద చేపడుతున్నామని తెలిపింది. ఇందుకు గాను రూ.250 కోట్ల మేర ప్రాథమిక పెట్టుబడి పెట్టనున్నట్టుగా సంస్థ వెల్లడించింది. దేశంలో గృహాలకు గణనీయమైన డిమాండ్ ఉందని.. డిమాండ్-సప్లయి మధ్య నిలిచిపోయిన ఖాళీని అందుబాటు ధరల్లో ఇండ్లను అందించడం ద్వారా భర్తీ చేయించేందుకు తాము కట్టుబడి ఉన్నామని హెచ్డీఎఫ్సీ ఎండీ రేణుసూద్ కర్నాడ్ అన్నారు. ఈ లక్ష్యంతోనే తాము అరవింద్ స్మార్ట్స్పేస్తో జట్టుకట్టినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా అరవింద్ స్మార్ట్ స్పేస్ చైర్మెన్ సంజరు లాల్భారు మాట్లాడుతూ రెండు సంస్థల భాగస్వామ్యంతో వాటాదారులకు మరింత విలువను జోడించేందుకు వీలు పడుతుందని అన్నారు. టాప్ రేటెడ్ సంస్థలు రెండు జట్టు కట్టడం వల్ల వినియోగదారులకు మేలు జరుగుతుందని అన్నారు.