Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశంలో అతిపెద్ద రిటైల్ ఆఫ్లైన్ డిస్కవరీ వేదిక మ్యాజిక్పిన్ పండుగల సీజన్ను పురస్కరించుకొని 'మ్యాజిక్ పిన్ దివాళీ వీక్'ను ప్రకటించింది. ఈ ప్రత్యేక వీక్ ఈ నెల 19న ప్రారంభమైందని.. ఈ నెల 26 వరకు తొమ్మిది రోజుల పాటు ఇది కొనసాగుతుందని సంస్థ తెలిపింది. వినియోగదారులు మరికు ఆఫ్లైన్ రిటైలర్ల మధ్య మరింత ప్రగాఢమైన అనుభందాన్ని ఏర్పరిచేందుకు గాను రీడిస్కవర్ ది రియల్ థీమ్తో దీనిని అమలు పరుస్తున్నట్టుగా సంస్థ తెలిపింది. మ్యాజిక్పిన్ సంస్థ ఈ ప్రత్యేక వీక్ సందర్భంగా రూ.200 కోట్ల మేర జీఎంవీతో ఊతమందిచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా సంస్థ ఒక ప్రటకనలో తెలిపింది. భాగస్వాములకు ఆక్టోబరు మాసంలో భాగస్వాములకు దాదాపు రూ.600 కోట్ల మేర జీఎంవీని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా సంస్థ తెలిపింది. మ్యాజిక్పిన్ ద్వారా వినియోగదారులు ఆఫ్లైన్ ద్వారా తాము వెచ్చించిన మొత్తానికి రివార్డులు పొందవచ్చని సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో అంశూ శర్మ తెలిపారు. తమ వేదికపై దాదాపు ఎనిమిది లక్షల మంది రిటైలర్లు భాగస్వాములుగా ఉన్నట్టుగా ఆయన వివరించారు. ఈ వేడుకలో భాగాస్వాములయ్యేందుకు గాను మ్యాజిక్పిన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ప్రతి లావాదేవీకి వినియోగదారులు మ్యాజిక్పిన్ పాయింట్ల రూపంలో రివార్డులు పొందుతారని అన్నారు.